Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం పొడగింపు

Advertiesment
Telangana
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:42 IST)
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారంరోజుల పాటు పొడగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఏప్రిల్ 20వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది.
 
మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.
 
తెలంగాణలో క‌రోనా కేసుల  విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. బుధవారం రాత్రి 8 గంట‌ల నుంచి గురువారం రాత్రి 8 గంటల మ‌ధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 5,926 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,441 మందికి క‌రోనా సోకింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల గళాన్ని విందాం... అణిచివేస్తే ధిక్కరణ చర్యలే : సుప్రీంకోర్టు