వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (09:24 IST)
సమాజంలో వరకట్నం వేధింపులు ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ యువకుడు తన గొప్ప మనసు చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కానుకగా అత్తమామలు ఇచ్చిన లక్షల రూపాయల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించారు. వధువే తమకు అసలైన కానుక అని చాటి చెప్పారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో జరిగింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహార‌న్‌పూర్ జిల్లాలోని భాబ్సి రాయ్‌పూర్ గ్రామానికి చెందిన వికాస్ రాణా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన తండ్రి శ్రీపాల్ రాణా గతంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరపున యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. సంస్కరణ భావాలు కలిగిన వికాస్‌‍కు, హర్యానాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో వివాహం నిశ్చమైంది. 
 
ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీన వికాస్ రాణా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కురుక్షేత్రకు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్‌లో వివాహం వేడుకకు అన్ని ఏర్పాట్లుచేశారు. వివాహ వేడుకలో భాగంగా, తిలకం కార్యక్రమం జరుగుతుండగా, వధువు తల్లిదండ్రులు వరుడు వికాస్ రాణాకు సంప్రదాయం ప్రకారం రూ.31 లక్షల నగదు కట్నంగా అందజేశారు. 
 
అయితే, ఆ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు వికాస్ సున్నితంగా తిరస్కరించారు. తనకు కాబోయే కోడలు అగ్రికా తన్వరే అసలైన కానుక అని, అంతకుమించిన కట్నం తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వరుడు అభీష్టం మేరకు, కేవలం ఒక రూపాయి నాణెం, కొబ్బరికాయతో సంప్రదాయబద్ధంగా వెళ్లి తంతును పూర్తి చేశారు. వరకట్నం కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వికాస్ రాణా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇది సమాజానికి మంచి సందేశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments