Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో కరోనా విలయం : ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్

Webdunia
గురువారం, 6 మే 2021 (08:42 IST)
దేశంలోని అందమైన సముద్రతీర పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గోవాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వైరస్ సోకివుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 51 శాతానికి పెరిగింది. 
 
దేశంలో కరోనా వైరస్ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో గోవా ఒకటి. ఈ రాష్ట్రంలో వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఇక్కడ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరు పాజిటివ్‌గా తేలడం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
గత నెలతో పోలిస్తే ఇక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇక్కడ కరోనా పాజిటివిటీ రేటు 40 శాతంగా ఉండగా, ఇప్పుడిది 51 శాతంగా ఉంది. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇదిలావుండగా, పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తర్వాత హర్యానా రెండోస్థానంలో ఉంది. ఇక్కడ పాజిటివిటీ రేటు 37 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
గోవాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పర్యాటకాన్ని కూడా కొంతకాలం మూసివేయడం మేలని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments