Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నెలల తర్వాత పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ- అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు..?

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (13:31 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా మళ్లీ పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించడంతో ఎంపీగా మారారు. ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీకు ఊరట లభించింది. 
 
మోదీ ఇంటిపేరు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు జడ్జి రాహల్‌కు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాహుల్ గాంధీకి ఊరటను కల్పించింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. అయితే, ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని రాహుల్ కు సుప్రీంకోర్టు హితవు పలికింది. 
 
మరోవైపు, పార్లమెంటుకు వచ్చిన రాహుల్ తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పార్లమెంటు భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఇండియా కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
 
మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్ సభలో ఈ తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక రోజు ముందు రాహుల్ పార్లమెంట్‌లో అడుగుపెట్టడం కీలక పరిణామంగా భావించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments