Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకేలో లుకలుకలు.. పార్టీలో ఓట్లు చీలుతాయా? స్థానిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

అన్నాడీఎంకే వారసత్వం కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే చెందిన ఓట్లు చీలిపోనున్నాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (11:00 IST)
అన్నాడీఎంకే వారసత్వం కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే చెందిన ఓట్లు చీలిపోనున్నాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేయగా ఆయనపై శశికళ వర్గం బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించింది. 
 
శశికళ నాలుగేళ్ల వరకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశమే లేదు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళవర్గం నేత ఎడప్పాడి కె పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అదేసమయంలో పన్నీర్‌ సెల్వం వర్గం అన్నాడీఎంకే-2గా పనిచేస్తోంది. అంటే జయలలిత జీవించి వుండగా, ఐక్యంగా ఉన్న అన్నాడీఎంకే ఆమె మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. మరోవైపు... జయలలిత అన్న కుమార్తె జయ దీప రాజకీయ అరంగేట్రం చేశారు. 
 
ఈమె ఎంజీఆర్‌ జయ దీప పేరుతో ఓ రాజకీయ ఫోరంను ప్రారంభించారు. దీంతో స్థానిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున మూడు గ్రూపులు ఏర్పడటంతో ఓట్లు చీలుతాయని రాజకీయ పండితులు అంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments