Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రంలో ఆన్‍‌లైన్ వివాహాలకు చట్టబద్ధత - కేరళ కోర్టు అనుమతి

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (09:11 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా పలు కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేరళ కోర్టు ఆన్‌లైన్ పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన మహిళా న్యాయవాది రింటు థామస్ (25), అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి వివాహం గురువారం జరగాల్సివుంది. కానీ ఒమిక్రాన్ రూపంలో ఈ పెళ్లికి ఆటంకం ఏర్పడింది. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నాయర్ బుధవారం స్వదేశానికి రావాల్సి వుండగా, ఒమిక్రాన్ ఆంక్షలు అమల్లో ఉండటంతో అతను రాలేక పోయారు. 
 
దీంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకునేందుకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్‌రిజిస్ట్రార్‌లను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఎన్.నగరేశ్ ఆమె వినితిని అంగీకరించారు.
 
కరోనా సమయంలో ఆన్‌లైన్ వివాహాలకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇపుడు కూడా దానిని అమలు చేయవచ్చని, అందువల్ల రింటు థామస్ పెళ్లికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments