Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో క్రూరం : ఆర్టీఐ కార్యకర్త కాళ్లకు మేకులు కొట్టారు...

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (08:41 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేశాడన్న అక్కసుతో ఆర్టీఐ కార్యకర్తను కిడ్నాప్ చేశారు. కాళ్లకు మేకులు కొట్టారు. చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఆ తర్వాత ఆ కార్యకర్త చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బార్మర్ జిల్లాకు చెందిన 30 యేళ్ల అమ్రారామ్ గోద్రా అనే వ్యక్తి ఓ ఆర్టీఐ కార్యకర్త. గ్రామ పంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం, అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మద్యం మాఫియా ఈ నెల 21వ తేదీన ఆయన్ను కిడ్నాప్ చేసింది. ఆపై ఇనుమపరాడ్లతో ఆయనపై దాడి చేశారు. కాళ్లు చేతులు విరగ్గొట్టారు. ఆ తర్వాత రెండు కాళ్లకు మేకులు కొట్టారు. ఆ చిత్ర హింసలు భరించలేక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతను చనిపోయాడని భావించి ఓ రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. 
 
అతన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఆస్పత్రికి తరలించినట్టు బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ వెల్లడించారు. ఈ ఘటనపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుని శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments