Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో క్రూరం : ఆర్టీఐ కార్యకర్త కాళ్లకు మేకులు కొట్టారు...

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (08:41 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేశాడన్న అక్కసుతో ఆర్టీఐ కార్యకర్తను కిడ్నాప్ చేశారు. కాళ్లకు మేకులు కొట్టారు. చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఆ తర్వాత ఆ కార్యకర్త చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బార్మర్ జిల్లాకు చెందిన 30 యేళ్ల అమ్రారామ్ గోద్రా అనే వ్యక్తి ఓ ఆర్టీఐ కార్యకర్త. గ్రామ పంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం, అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మద్యం మాఫియా ఈ నెల 21వ తేదీన ఆయన్ను కిడ్నాప్ చేసింది. ఆపై ఇనుమపరాడ్లతో ఆయనపై దాడి చేశారు. కాళ్లు చేతులు విరగ్గొట్టారు. ఆ తర్వాత రెండు కాళ్లకు మేకులు కొట్టారు. ఆ చిత్ర హింసలు భరించలేక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతను చనిపోయాడని భావించి ఓ రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. 
 
అతన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఆస్పత్రికి తరలించినట్టు బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ వెల్లడించారు. ఈ ఘటనపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుని శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments