Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 10 వరకు స్కూల్స్ బంద్ - ఆన్‌లైన్‌ క్లాసులకు ఆదేశం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (16:22 IST)
కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఈ నెల 10వ తేదీ వరకు ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌ను మూసివేసింది. అయితే, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరిచినప్పటికీ తల్లిదండ్రుల అనుమతి లేఖతో వెళ్లిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇవి ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అమల్లో ఉంటాయి. 
 
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశం మేరకు సోమవారం నుంచి చిన్నారులకు కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. స్థానిక సైదాపేటలోని మాందోపు హైస్కూల్‌లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లోనే టీకాలు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments