Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#Omicron సునామీలా విరుచుకుపడుతుంది : #WHO చీఫ్ సైంటిస్ట్

#Omicron సునామీలా విరుచుకుపడుతుంది : #WHO చీఫ్ సైంటిస్ట్
, శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ సునామీలా విరుచుకుపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. అందువల్ల ఈ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోరాదని కోరారు. భారత్‌లో ఇప్పటికే 1200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసులు సాధారణంగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో ఉప్పెనలా పెరగనున్నాయని తెలిపారు. చాలా మంది అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ఇదే జరిగితే భారత్‌లో మాత్రం మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్యతో పాటు.. ఆస్పత్రుల్లో చేరే ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అందువల్ల అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ను ప్రతి  ఒక్కరూ సాధారణ జలుబులా తీసుకుంటున్నారని, ఇదే పెను ముప్పుకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన పాకిస్థాన్