Webdunia - Bharat's app for daily news and videos

Install App

232 రోజుల తర్వాత గృహనిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లాకు విముక్తి

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (15:59 IST)
జమ్మూకాశ్మీర్‌కు కల్పిస్తూ వచ్చిన స్వయంప్రతిపత్తిని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసింది. అలాగే, ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని కూడా తొలగించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి కాశ్మీర్ నేతలందరినీ గృహ నిర్బంధంలోకి ఉంచింది. అలాంటి వారిలో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒకరు. 
 
తాజాగా ఆయనపై నిర్బంధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. దాంతో ఆయనను విడుదల చేశారు. గత ఎనిమిది నెలలుగా అంటే 232 రోజులుగా ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనపై ఉన్న గృహనిర్బంధం ఎత్తివేయడంతో మంగళవారం హరినివాస్ నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన నేరుగా తన తండ్రి ఫరూక్ అబ్దుల్లా నివాసానికి వెళ్లితో తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం ఆరగించారు.
 
కాగా, ఒమర్ అబ్దుల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లాను కేంద్రం నిర్బంధం నుంచి విడుదల చేసింది. తాజాగా ఓ ప్రకటనలో ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నట్టు జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్రణాళిక విభాగం) రోహిత్ కన్సాల్ వెల్లడించారు. ఆ తర్వాత హరినివాస్ నుంచి ఒమర్ అబ్దుల్లా రిలీజ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments