Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేబులో చౌక ఫోన్.. పేలిపోయింది.. వృద్ధుడు సజీవదహనం..

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (11:25 IST)
స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం నడపదనేవారు చాలామందే వున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఎంత ప్రమాదమో చాలామంది గ్రహించట్లేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. రాజస్థాన్ సర్కారు అందించిన చౌక ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. రాజస్థాన్ సర్కారు అందజేసిన ఫోన్‌ను జేబులో పెట్టుకున్న పాపానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
జేబులో పెట్టుకున్న ఫోన్ పేలడంతో ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నెతావల్ గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్థాన్ సర్కారు రూ.1100కు అందజేసిన ఫోనును కొనుగోలు చేశాడు. ఈ ఫోన్‌ను రాత్రి నిద్రించేటప్పుడు కూడా జేబులో పెట్టుకున్నాడు. 
 
అంతే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జేబులో వున్న ఫోన్ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోనులోని ఛార్జర్ వేడి కావడంతోనే అది పేలిపోయిందని.. మంటలు దుస్తులకు బాగా అంటుకుపోవడంతో నిద్రలో వున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments