Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేబులో చౌక ఫోన్.. పేలిపోయింది.. వృద్ధుడు సజీవదహనం..

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (11:25 IST)
స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం నడపదనేవారు చాలామందే వున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఎంత ప్రమాదమో చాలామంది గ్రహించట్లేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. రాజస్థాన్ సర్కారు అందించిన చౌక ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. రాజస్థాన్ సర్కారు అందజేసిన ఫోన్‌ను జేబులో పెట్టుకున్న పాపానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
జేబులో పెట్టుకున్న ఫోన్ పేలడంతో ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నెతావల్ గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్థాన్ సర్కారు రూ.1100కు అందజేసిన ఫోనును కొనుగోలు చేశాడు. ఈ ఫోన్‌ను రాత్రి నిద్రించేటప్పుడు కూడా జేబులో పెట్టుకున్నాడు. 
 
అంతే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జేబులో వున్న ఫోన్ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోనులోని ఛార్జర్ వేడి కావడంతోనే అది పేలిపోయిందని.. మంటలు దుస్తులకు బాగా అంటుకుపోవడంతో నిద్రలో వున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments