Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (10:27 IST)
శాస్త్రోక్తంగా జరగాల్సిన గోపురం ప్రతిష్ఠ మసక మారింది. 2 గ్రూపుల మధ్య తలెత్తిన విభేదాలు 12 మందిని పొట్టన బెట్టుకున్నాయి. మైసూరు సమీపంలోని చమరాజనగర్ జిల్లా సులివాడ గ్రామంలో విషపూరిత ప్రసాదం సేవించడంతో పల్లె స్మశానంలా మారింది. మైసూరు సహా పలు ప్రాంతాల్లో సుమారు 80 మంది చికిత్స పొందుతున్నారు.
 
సమాచారం తెలుసుకున్న సీఎం కుమారస్వామి హుటాహుటిన మైసూరు చేరుకుని అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. మృతుల కుటుంబీలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. 
వివరాల్లోకి వెళితే... చమరాజనగరా జిల్లా కొల్లేగ్ల తాలూకలో గోపురం కోసం తలెత్తిన గ్రూపు తగాదాలు ఆ పల్లెను స్మశానంలా తయారు చేశాయి. 
 
భక్తితో ప్రసాదం సేవించిన 12 మంది అమాయకులు మృతి చెందగా మరో 60 మంది ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. సులువాడి గ్రామంలో ఉదయం 10.30 గంటలకు కీచుగుతి మారం ఆలయం గోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా ఆలయంలో ప్రత్యక పూజలు కొనసాగాయి.
 
మధ్యాహ్నం 1 గంటకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తి భావనతో ఆరగించిన వారికి కేవలం ఒక గంట వ్యవధిలోనే ఆరోగ్యంలో అలజడి చెలరేగింది. పరిస్థితి విషమంగా మారింది. దాంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడే పడవేసిన ప్రసాదాన్ని తిన్న కాకులు కూడా మరణించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments