Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (10:27 IST)
శాస్త్రోక్తంగా జరగాల్సిన గోపురం ప్రతిష్ఠ మసక మారింది. 2 గ్రూపుల మధ్య తలెత్తిన విభేదాలు 12 మందిని పొట్టన బెట్టుకున్నాయి. మైసూరు సమీపంలోని చమరాజనగర్ జిల్లా సులివాడ గ్రామంలో విషపూరిత ప్రసాదం సేవించడంతో పల్లె స్మశానంలా మారింది. మైసూరు సహా పలు ప్రాంతాల్లో సుమారు 80 మంది చికిత్స పొందుతున్నారు.
 
సమాచారం తెలుసుకున్న సీఎం కుమారస్వామి హుటాహుటిన మైసూరు చేరుకుని అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. మృతుల కుటుంబీలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. 
వివరాల్లోకి వెళితే... చమరాజనగరా జిల్లా కొల్లేగ్ల తాలూకలో గోపురం కోసం తలెత్తిన గ్రూపు తగాదాలు ఆ పల్లెను స్మశానంలా తయారు చేశాయి. 
 
భక్తితో ప్రసాదం సేవించిన 12 మంది అమాయకులు మృతి చెందగా మరో 60 మంది ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. సులువాడి గ్రామంలో ఉదయం 10.30 గంటలకు కీచుగుతి మారం ఆలయం గోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా ఆలయంలో ప్రత్యక పూజలు కొనసాగాయి.
 
మధ్యాహ్నం 1 గంటకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తి భావనతో ఆరగించిన వారికి కేవలం ఒక గంట వ్యవధిలోనే ఆరోగ్యంలో అలజడి చెలరేగింది. పరిస్థితి విషమంగా మారింది. దాంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడే పడవేసిన ప్రసాదాన్ని తిన్న కాకులు కూడా మరణించాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments