Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. డాక్టర్ ఇల్లు ఖాళీ చేయకపోతే.. అత్యాచారం చేస్తానన్నాడు..

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (16:27 IST)
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తాకిడి ఒడిశా చాలా దూరంలో వుంది. ఈ రాష్ట్రంలో కేవలం మూడు కేసులే న‌మోదు అయినా.. ప్రజల్లో భయం మాత్రం ఎక్కువగానే ఉంది. తాజాగా ఓ మహిళా డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఓ యువ మహిళా డాక్టర్.. ఓ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్‌లో ఉంటోంది. 
 
కానీ ఒడిశాలో క‌రోనా కేసులు స్టాట్ అవ్వ‌డంతో ఆ ఫ్లాట్‌లో వాళ్లంతా స‌ద‌రు డాక్టర్‌ను అదోలా చూడటం మొదలుపెట్టారు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆమెను ఫ్లాట్ నుంచి ఖాళీ చేయించాలనుకున్నారు. ఆ ఫ్లాట్ ఓవర్ ఇంకా బేరర్ అయిన అతను ఆమెను పంపిచేస్తానని హామీ ఇచ్చాడు.  
 
ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బేర‌ర్‌, అత‌ని భార్య కలిసి.. ఆమెను ఖాళీ చెయ్యమని పదే పదే చెప్పారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్న ఆమె ఖాళీ చెయ్యకపోవడంతో... బేర‌ర్‌ ఆమె ఫ్లాట్‌కి వెళ్లి.. ఒంటరిగా వున్నావ్.. తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. దొరికిపోతావ్.. అత్యాచారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యురాలికి చిర్రెత్తుకొచ్చింది.
 
ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేశారు. మ‌రోవైపు సొసైటీ మొత్తం ఆ డాక్టర్‌పై కేసు పెట్టింది. ఆమె ఆఫీస్ బేరర్‌తో అమర్యాదగా ప్రవర్తించిందని కంప్లైంట్‌లో తెలిపారు. ఇక‌ పోలీసులు ప్ర‌స్తుతం రెండు కేసుల్నీ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments