Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా మగ్గబెట్టిన పనసపండు ఇంట్లో పెట్టుకున్న పాపం.. ఏనుగులు వచ్చి?

బాగా మగ్గబెట్టిన పనసపండును ఇంట్లో వుంచిన పాపానికి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పనసపండు వాసనకు ఇంట్లోకి చొరబడిన ఏనుగుల గుంపు ఆ ఇంట్లోని తల్లీకుమారుడిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కచు

Webdunia
శనివారం, 15 జులై 2017 (12:19 IST)
బాగా మగ్గబెట్టిన పనసపండును ఇంట్లో వుంచిన పాపానికి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పనసపండు వాసనకు ఇంట్లోకి చొరబడిన ఏనుగుల గుంపు ఆ ఇంట్లోని తల్లీకుమారుడిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కచురా ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కచురా గ్రామానికి చెందిన సమరి ప్రధాన్(35) ఇంట్లో బాగా పండిన పనసపండు వున్నది. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో పనసపండు సువాసనను గ్రహించిన ఐదు ఏనుగులు వారి ఇంటిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో సమరి ఆమె కుమారుడు శత్రఘ్నుడు (6) ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన ఏనుగులు సమరిని, శత్రఘ్నను తొండంతో పైకెత్తి విసిరికొట్టి చంపేశాయి. 
 
స్థానికుల సమాచారం అందేలోపు ఏనుగులు ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. అటవీ అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. తరచుగా తమ గ్రామంపై ఏనుగుల దాడి చేస్తున్నాయని, దీనిని నివారించాలని గ్రామస్థులు అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా సమరి భర్తను కోల్పోయింది. ఆమెకు మరో కుమారుడున్నాడు. అతనిని ఇటీవలే హాస్టల్‌లో చేర్చిన సమరి.. ఆమె అమ్మ, రెండో కుమారుడితో కచురాలో వుంటోంది. 
 
ప్రస్తుతం సమరి కాస్త మరణించడంతో ఆమె పెద్ద కుమారుడు అనాధగా మిగిలిపోయాడు. అతనికి నష్టపరిహారంగా ప్రభుత్వం రూ.6లక్షలు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులు కోరారు. ఏనుగుల నుంచి తన బిడ్డను రక్షించాలని సమరి ఎంతగానో పోరాడిందని.. అయితే ఏనుగులు వారిద్దరీ మట్టుబెట్టాయని అధికారులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments