Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ... సిఫార్సు చేసిన రైల్వే బోర్డు

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (09:08 IST)
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని భారతీయ రైల్వే బోర్డు సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 275 మంది మృతి చెందగా దాదాపు వెయ్యికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘోరకలిపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కేంద్ర రైల్వే బోర్డు సిఫారసు చేసింది. 
 
ఘటన స్థలంలో సహాయ చర్యలు, ట్రాక్ పునరుద్ధణ వంటి పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు, బెంగుళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరిమితి వేగంతోనే ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచేందుకు వీలుంది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు 128 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. 
 
ఈ మార్గంలో ఎలక్ట్రానికి లాకింగ్ వ్యవస్థ కూడా సజావుగానే ఉందని, కానీ అందులో ఎవరైనా ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నిలింగ్ లోపమే ఈ ఘోర దుర్ఘటనలకు కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొనడం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments