Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్..

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (12:30 IST)
కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్. కులాంతర వివాహాలను ప్రోత్సహించే దిశగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కులాంతర వివాహాలు చేసుకునేవారు సర్కారు ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమంగళ్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సుమంగళ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. 
 
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచామని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. గతంలో రూ.50వేలున్న అంతర్ కుల వివాహ ప్రోత్సాహకాన్ని 2017లో లక్షరూపాయలకు పెంచింది. ప్రస్థుతం దీన్ని రెండున్నర లక్షల రూపాయలకు పెంచింది. కులాంతర వివాహాలు సామాజిక సామరస్యానికి దోహదపడతాయని సీఎం చెప్పారు.
 
ఉన్నత కులానికి చెందిన వారు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకుంటే వన్ టైమ్ ప్రోత్సాహకం అందిస్తామని సర్కారు వెల్లడించింది. మొదటిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రాంట్ ఇస్తామని, అయితే వధువు వితంతువు అయితే వారు ప్రోత్సాహకానికి అర్హులని సర్కారు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం