Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చిల్లిగవ్వ లేదు.. ఇంటిపైకప్పు పీకి దహనం చేశారు!

ఇటీవలికాలంలో ఒడిషా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుందనే అనుమానం కలగుతుంది. ఎందుకంటే మొన్నటికిమొన్న భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్ల మేరకు మోసుకెళ్లాడు.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:42 IST)
ఇటీవలికాలంలో ఒడిషా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుందనే అనుమానం కలగుతుంది. ఎందుకంటే మొన్నటికిమొన్న భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్ల మేరకు మోసుకెళ్లాడు. 
 
ఆ తర్వాత మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తల్లి శవాన్ని ఓ గిరిజన మహిళ రిక్షాలో తీసుకెళ్లింది. ఈ ఘటనలు మరువక ముందే ఒడిషా రాష్ట్రంలో మరోమారు ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దీనావస్థను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కలహండి జిల్లా దోక్రిపడ గ్రామంలో కనక్ సత్పతి (75) అనే వృద్ధురాలు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు నలుగురు కుమార్తెలు. కుమారులు లేరు. అయితే, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి వద్ద నయాపైసా లేదు. 
 
దీంతో చుట్టుపక్కల వారిని సాయం చేయమని వేడుకున్నా వారు. కానీ వారు ఏమాత్రం కనికరం చూపలేదు. దీంతో ఆ నలుగురు కుమార్తెలు తల్లి శవాన్ని భుజాలపై మోస్తూ శ్మశానికి తీసుకెళ్లారు. అయితే, దహన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన కట్టెలను కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటి పైకప్పును తొలగించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments