Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం మహిళా ఎంపీ కాళ్ళకు మెట్టెలు - నుదుట బొట్టు పెట్టుకుందనీ...

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (12:13 IST)
నుస్రత్ జహాన్. ఈమె వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు తృణమూల్ ఎంపీగా ఎంపికైంది. పైగా, కొత్తగా పెళ్లి చేసుకుంది. అదీ కూడా ఓ హిందూ వరుడ్ని. దీంతో ఆమె కాలికి మెట్టెలు, నుదట బొట్టు, మెడలో మంగళసూత్రం ధరించింది. ఈమెల 25వ తేదీన ఆమె లోక్‌సభలో అడుగుపెట్టారు. 
 
ఇదే ఇప్పుడామెను చిక్కుల్లోపడేసింది. ఇస్లాంకు, షరియత్‌కు విరుద్ధమైన పద్ధతులను ఆమె ఆచరిస్తున్నారంటూ ఓ ముస్లిం పెద్ద నుస్రత్‌ జహాన్‌పై ఫత్వాను జారీ చేశారు. బెంగాలీ నటి కూడా అయిన నుస్రత్‌.. బసిర్హాత్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇటీవలే హిందూ వ్యాపారి నిఖిల్‌ జైన్‌ను అమె పెళ్లాడారు. భర్త తరపువారి మతాచారాలనే ఆమె పాటించాలని నిర్ణయించుకుంది. 
 
దీన్ని ముఫ్తీ అసద్‌ వాస్మీ అనే మతపెద్ద తీవ్రంగా తప్పుబట్టారు. బొట్టు, మంగళసూత్రం, మట్టెలతో సభకు ఆమె హాజరవడంపై ముఫ్తీ మండిపడ్డారు. షరియత్‌ను నుస్రత్‌ ఉల్లంఘించారంటూ ఆమెపై ఆయన ఫత్వా జారీ చేశారు. 
 
అయితే.. నుస్రత్‌కు బీజేపీ నేత సాధ్వి ప్రాచి మద్దతు పలికారు. హిందూ అమ్మాయిలను అదే ముస్లిం యువకులు లవ్‌ జిహాద్‌ పేరిట వలలో వేసుకుని బుర్ఖా ధరించాలని ఒత్తిడి చేస్తే ధర్మ విరుద్ధం కాదు కానీ.. ఒక ముస్లిం మహిళ.. హిందువును పెళ్లాడి మంగళసూత్రం, నుదుటన బొట్టు పెట్టుకుంటే ముస్లిం మతపెద్దలకు ధర్మవిరుద్ధంగా కనిపిస్తుందా? అని నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments