Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముప్పు పొంచివుంటే తప్పక దాడి చేస్తాం .. అజిత్ ధోవల్ :: క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (12:31 IST)
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 24న రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమంలో భక్తులను ఉద్దేశించి అజిత్ ధోవల్ మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా భారతదేశ ఆధ్యాత్మికత గొప్పదనం గురించి చెప్పారు. ఏ దేశంపై కూడా మనం దాడి చేయలేదనే విషయం అందరికీ తెలుసని... కానీ, ఏ దేశం నుంచైనా మనకు ముప్పు పొంచి ఉంటే మాత్రం... మనం తప్పకుండా దాడి చేస్తామని చెప్పారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ పని చేయాల్సిందేనని అన్నారు. 
 
ధోవల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. లడఖ్ విషయంలో చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ తెరపైకి రావడంతో కేంద్రం కలుగజేసుకుంది. ఆధ్యాత్మిక ధోరణితో తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే ధోవల్ చెప్పారని కేంద్రం తెలిపింది. ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి ధోవల్ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments