Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా పండుగ రోజున దేవుడికి నాలుకను నైవైద్యంగా పెట్టిన భక్తులు!!

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (12:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేవలం నేరాలు ఘోరాలకు మాత్రమే అడ్డాగా మారిందని ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ రాష్ట్ర వాసుల్లో మూఢభక్తి కూడా ఎక్కువగా ఉందనే విషయాన్ని రుజువు చేస్తోంది. 
 
దసరా పండుగ పర్వదినం రోజున ఈ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలోని ఆలయంలో 22 ఏళ్ల యువకుడు తన నాలుకను కోసుకున్నాడు. దాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు.
 
తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటనపై సదరు యువకుడి తండ్రి మాట్లాడుతూ, తన కుమారుడి మానసికస్థితి సరిగా లేదని చెప్పారు. నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని తెలిపారు.
 
ఉత్తరప్రదేశ్‌లోనే ఆదివారం ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కురారా ప్రాంతంలోని కోకేశ్వర్ శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా అనే వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments