Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (07:41 IST)
దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో కొత్త విద్యా సంవత్సరం 2023-24కు గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటనను జారీ చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 17వ తేదీ రాత్రి 7గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉండాలని స్పష్టం చేసింది. ఈ వయస్సును నూతన జాతీయ విద్యా విధానం కింద ఆరేళ్లకు పెంచారు. 
 
కేవీల్లో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి ప్రాథమిక /వెయిటింగ్‌ తొలి జాబితాను ఏప్రిల్‌ 20న విడుదల చేసి ఏప్రిల్‌ 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 
 
అలాగే, రెండు, ఆ పైతరగతుల్లో ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 3వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్‌ 12వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. పూర్తి వివరాలను https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ను చూసి తెలుసుకోవచ్చని పెర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments