Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుంది : బాంబే హైకోర్టు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (13:32 IST)
ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుందని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. పైగా, వివాహమైన మహిళ చేసే ఇంటి పనులన్నీ కుటుంబం కోసమే వస్తాయని, ఇవి క్రూరత్వం కిందక రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇంట పనులు చేయమని చెప్పినంతనే పనిమనిషితో పోల్చడం సరికాదని చెపుతూ విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన ఓ వివాహిత హెట్టిన గృహహింస కేసును కోర్టు కొట్టివేసింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, వివాహమైన నెల రోజుల్లోనే తన భర్తతో పాటు అత్తమామలు ఓ ఇంటి పనిమనిషిలా చూడటం ప్రారంభించారని, కారు కొనుక్కునేందుకు రూ.4 లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించారని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీనిపై తాజాగా ఔరంగాబాద్ బెంచ్ తాజాగా విచారణ జరిపింది. పెళ్లయిన మహిళను ఇంటి పనులు చేయమని అడగం అంటే అది ఖచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని, దాన్ని పని మనిషి చేసే పనితో పోల్చడం సరికాదని పేర్కొంది. 
 
తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం.. సెక్షన్ 498ఏ కింద ఈ కేసు వర్తించదని స్పష్టం చేస్తూ ఆ కేసును కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments