Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులకు ఆ వసతులు కల్పిస్తున్న పాక్ ఆర్మీ: ఉపేంద్ర

Webdunia
శనివారం, 7 మే 2022 (22:11 IST)
భారత్‌లోకి చొరబడేందుకు జమ్ముూ-కాశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 మైనర్ క్యాంపులు, వివిధ సైనిక స్థావరాలకు సమీపంలో తాత్కాలిక ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయని చెప్పారు. 
 
పాకిస్థాన్‌ ఆర్మీ ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాక్‌ ఆర్మీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు.  
 
కాగా, ఉగ్రవాదుల చొరబాట్లను ధీటుగా తిప్పికొడతామని ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీని కోసం రెండంచుల రక్షణగా రిజర్వ్‌ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.  
 
మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం మేరకు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విమరణ బాగానే కొనసాగుతుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. గత 12 నెలల్లో చాలా తక్కువగా కాల్పుల విమరణ ఉల్లంఘన జరిగిందని, ఒకటి నుంచి మూడు సార్లు జరిగి ఉండవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments