Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై బీచ్ స్టేషనులో ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిన విద్యుత్ రైలు

train accident
, సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:52 IST)
చెన్నై బీచ్ రైల్వే స్టేషనులో ఒక విద్యుత్ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో రైలు బోగీలతో పాటు.. ఫ్లాట్‌ఫాంపై ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఈ రైలు డ్రైవర్ ధైర్యం చేసి ఫ్లాట్‌ఫాంపై దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం చెన్నై బీచ్ స్టేషన్ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై జరిగింది. 
 
షెడ్డు నుంచి ఈ స్టేషన్‌కు వచ్చిన ఒక సబర్బన్ రైలు అదుపుతప్పి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ విద్యుత్ రైలు నియంత్రణ కోల్పోడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు డ్రైవరు కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ రైలు మాత్రం పట్టాలు తప్పి ఫ్లాట్‍ఫాంపైకి దూసుకెళ్లి అక్కడ నుంచి ఫ్లాట్‌పాంను చివరి భాగాన్ని ఢీకొట్టింది. 
 
ఈ క్రమంలో రైలు ఫ్లాట్‌ఫాంపైకి ఎక్కింది. దీంతో స్టేషన్ పైకప్పు కూడా దెబ్బతింది. రైలు ప్రమాదానికి గురైన సమయంలో రైలులో ప్రయాణికులు లేరు. ఈ రైలు షెడ్డు నుంచి బీచ్ స్టేషన్‌కు వచ్చింది. పైగా, ఆదివారం కావడంతో రైల్వే స్టేషనులో కూడా ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు. దీంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 
 
ఈ ప్రమాదం గురించి దక్షిణ రైల్వే ప్రధాన పీఆర్వో బి.గుహనేశన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన రైలు షెడ్డు నుంచి బీస్ స్టేషన్‌ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిందని. అయితే, నియంత్రణ కోల్పోయిన రైలు ఫ్లాట్‌ఫాంను ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైసూరులో దారుణం- ఫోనులో గంటలపాటు గడిపింది... అందుకే..?