Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం కేసులో విచారణకు డుమ్మా... నిత్యానందకు వారెంట్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (09:54 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ అత్యాచారం కేసులో ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో బెంగుళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్‌ను జారీచేసింది. 
 
నిజానికి ఈ కేసులో నిత్యానంద స్వామిని విచారణకు రావాల్సిందిగా గత 2019లోనే కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన అప్పటి నుంచి డుమ్మా కొడుతూ వచ్చారు. పైగా, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో బాధితులు కోర్టుకు తమ ఆందోళన తెలియజేశారు. ఫలితంగా నిత్యానందకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీచేసింది. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం నిత్యానంద కైలాస అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ కైలాస దేశం ఎక్కడ ఉన్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈక్వెడార్‌ సమీపంలోని ఓ చిన్న దీవిని నిత్యానంద కొనుగోలు చేసి, దానికి కైలాస దేశం అని పేరు పెట్టారు. 
 
ఈ వార్తలను ఈక్వెడార్ దేశం ఖండించింది. మరోవైపు, నిత్యానంద స్వామి ఎయిడ్స్ వ్యాధి కారణంగా చనిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇటీవల ఓ వీడియో ద్వారా తాను ఇంకా జీవించివున్నట్టు, వైద్య చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments