Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిండుకింద ఫోన్ పెడుతున్నారా? కాస్త ఆలోచించండి..

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (15:01 IST)
స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవని రోజులివి. నిద్రలేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు కూడా సెల్‌ఫోన్‌ ఓ వ్యాపకంలా మారింది. నిద్రించే సమయంలో కూడా చేతికి అందేలా పెట్టుకుని నిద్రపోయే వారి సంఖ్య అధికం. మరికొందరైతే దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. చాలామంది దిండు కింద పెట్టుకుని నిద్రపోతుంటారు.  ఈ అలవాటే ఓ వ్యక్తికి ప్రాణాల మీదకు తెచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాంకి చెందిన ఓ వ్యక్తి తన ఫోనును దిండు కింద పెట్టుకుని నిద్రించాడు. అది ఒక్కసారిగా పేలడంతో అతడి భుజం, ఎడమ చేతికి గాయాలయ్యాయి. డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తాను.. బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నానని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కి పడి లేచే సమయంలో భుజం ఒక్కసారిగా నొప్పి చేసిందని, దిండు కాలిపోతూ.. ఫోన్‌ నుండి నిప్పులు చెలరేగాయని బాధితుడు చెప్పాడు. 
 
దీంతో ఫోన్‌ను దూరంగా విసిరేసి.. తాను ఆసుపత్రికి వెళ్లినట్లు వెల్లడించాడు. నిద్రపోయే సమయంలో ఫోన్‌ను దిండు కింద పెట్టానని, చార్జింగ్‌ కూడా పెట్టలేదని, కానీ బ్యాటరీ ఉబ్బిపోయి ఉందని బాధితుడు పేర్కొన్నాడు. ఆ ఫోన్‌ నోకియాకు చెందినదని.. ఎందుకు పేలిందో గుర్తించి... సమస్యను పరిష్కరించాలని బాధితుడు కోరుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments