Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ

జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (09:40 IST)
జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్ సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించారు. 
 
జాతిపిత హత్య కేసును జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. మహాత్మా గాంధీ హత్యలో ఓ విదేశీ సంస్థ హస్తం ఉందని, ఈ కేసును తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ ధర్మాసనం ఏర్పాటైంది. దీనికి సంబంధించిన అమికస్ క్యూరీగా అమరేంద్ర శరణ్‌ను సుప్రీంకోర్టు నియమించింది. 
 
కానీ కేసు పునర్విచారణ అవసరం లేదని శరణ్ తన నివేదికలో స్పష్టంచేశారు. విదేశీ సంస్థ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. గాంధీ శరీరంలోకి దిగిన బుల్లెట్లు, ఏ పిస్తోలు నుంచి వాటిని ఫైర్ చేశారు.. ఎవరు కాల్చారు.. దాని వెనుక కుట్ర.. ఇలా అన్నింటినీ స్పష్టంగా గుర్తించారు.
 
గాడ్సే కాకుండా మరో అజ్ఞాత వ్యక్తి గాంధీ హత్యలో పాలుపంచుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. గాంధీ శరీరంలో దిగిన నాలుగో బుల్లెట్ ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్చిందని, దానివల్లే ఆయన మరణించారన్న పిటిషనర్ వాదనను కూడా శరణ్ తోసిపుచ్చారు. అందువల్ల ఈ కేసు పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments