Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... ఒట్టిదే..! స్వర్ణం పన్నుపై కేంద్రం వివరణ

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (08:15 IST)
పరిమితికి మించి బంగారం కలిగి ఉన్నవారిపై పన్ను, జరిమానా విధించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ‘బంగారం క్షమాభిక్ష’ స్కీం అసలు పరిశీలనలోనే లేదని తేల్చిచెప్పింది.

తమ వద్ద ఎంత బంగారం ఉందో చెప్పాలని మోదీ ప్రభుత్వం స్పష్టం చేయనుందని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. పరిమితికి మించి ఉన్న బంగారంపై పన్ను విధించి.. ‘ఆమ్నెస్టీ’ (సార్వత్రిక క్షమాభిక్ష) కింద శిక్షించకుండా వదిలేస్తుందని.. తర్వాత కొరడా ఝళిపిస్తుందని.. లెక్కల్లో చూపించని బంగారంపై భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తుందని.. ప్రాసిక్యూట్‌ కూడా చేయొచ్చని.. కొత్తగా కొన్న బంగారు కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుందని.

రశీదు లేకుండా బంగారం కొంటే భారీ జరిమానాలు తప్పవని సదరు కథనాల్లో పేర్కొన్నాయి. ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఈ స్కీమును గతంలోనే తిరస్కరించిందని.. తాజాగా నీతి ఆయోగ్‌, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం దీనిని ప్రవేశపెట్టాలని గట్టిగా ప్రతిపాదిస్తున్నాయని వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. బడ్జెట్‌ ప్రక్రియ నడుస్తున్నప్పుడు ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments