Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెలాఖరు వరకు ఎయిర్‌ ఇండియా సేవలుండవ్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:13 IST)
ఎయిర్‌ ఇండియా సంస్థ ఈ నెల 30వ తేదీ వరకు తమ సర్వీసులను తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ మార్గాల్లో ఈ నెల 30 వరకు విమానాలు నడుపబోమని చెప్పింది.

మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆంక్షలు సడలిస్తారని, ఇందులో తమ సర్వీసులు కూడా ఉంటాయని భావిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల 24 నుంచి విమాన సర్వీసులు నిలిపోయాయి.

వాటిని యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయాన మంత్ర హర్దీప్‌ సింగ్‌పూరి రెండు రోజుల క్రితం ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా అత్యవససర సేవలు మినహా దేశంలో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి.

రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. గూడ్స్‌, నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం మాత్రమే కొన్ని విమానాలు, రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 14 వ తేదీతో లాక్‌డౌన్‌ పూర్తి కావడం, దాన్ని పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారంతో దేశీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలుకానున్నాయి.

ఈ నెల 15 వ తేదీ నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని విమాయన సంస్థలు భావిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments