Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు బ్లాక్.. రైలు టిక్కెట్లకు కూడా డబ్బు లేదు.. రాహుల్

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (19:25 IST)
కాంగ్రెస్‌కు చెందిన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ గత కొన్ని వారాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ అంశంపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ అగ్రనాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై కేంద్ర అధికారులపై మండిపడ్డారు.
 
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను కేంద్ర అధికారులు ఎంచక్కా టార్గెట్‌ చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘స్తంభింపచేసిన ఖాతాల కారణంగా మా పార్టీ ఎన్నికల ప్రచారానికి కూడా నిధులు సమకూర్చలేకపోతున్నాం. విమాన టిక్కెట్లు పక్కన పెడితే, మా ఎన్నికల ప్రచారానికి మా నాయకులకు రైలు టిక్కెట్లు కూడా కొనలేకపోతున్నాం.. అంటూ రాహుల్ గాంధీ చెప్పారు. 
 
తమ లోక్‌సభ ప్రచారానికి అయ్యే ప్రకటనల ఖర్చును కూడా కాంగ్రెస్ పార్టీ భరించే స్థితిలో లేదని   ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఈ మేరకు స్తంభింపజేయడం గతంలో ఎన్నడూ జరగలేదని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడంపై కాంగ్రెస్‌ ఎన్‌డీఏ ప్రభుత్వంపై మండిపడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments