మే 13న ఎన్నికలు - తెలంగాణలో రూ.10కోట్ల నగదు స్వాధీనం..

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (18:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు ఇప్పటివరకు రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, సీసీటీవీల ద్వారా మద్యం రవాణాను పర్యవేక్షించాలని హైదరాబాద్‌లోని పోలీస్ శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు. 
 
ఈ సమావేశంలో పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింత సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments