Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు జంక్ ఫుడ్ వద్దు.. ఊబకాయం, బద్ధకం పెరిగిపోతుంది.. యూజీసీ

విద్యార్థుల ఆహార విషయంలో యూజీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశంలోని అన్ని యూనివర్శిటీలు, ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (17:26 IST)
విద్యార్థుల ఆహార విషయంలో యూజీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశంలోని అన్ని యూనివర్శిటీలు, ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు బద్ధకంగా, ఊబకాయులుగా మారేందుకు ఈ జంక్ ఫుడే కారణమని.. యూజీసీ పేర్కొంది. విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. 
 
విద్యార్థుల జీవన విధానం, ఆలోచనా విధానాలు మెరుగుపరుచుకునేందుకు కాలేజీల్లో జంక్‌ఫుడ్‌ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరముందని వివరించింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా విద్యార్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే ఉత్సుకత పెరుగుతుందని యూజీసీ తెలిపింది. 
 
జంక్ ఫుడ్‌తో అధిక బరువు లాంటి సమస్యలు వస్తున్నాయని.. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌కి తగ్గట్టుగా యువత ఉండాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌ను మానేయడమే పరిష్కారమని యూజీసీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments