Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (19:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్ నో పెట్రోల్' విధానం అమలులోకి రానుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుకు వస్తే వారికి ఇంధనం నింపేందుకు అనుమతి నిరాకరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని జిల్లా అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇండోర్ జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
 
రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులు పెట్టుకునేలా ఇండోర్‌లో ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ వెల్లడించారు.
 
ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments