Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన ఐఎండీ.. వచ్చే ఐదు రోజుల్లో..

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:37 IST)
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎండల తీవ్ర తగ్గుతాయని పేర్కొంది. అలాగే, వడగాలులు కూడా వీచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. అదేసమయంలో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. 
 
తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడివుందని, ఫలింతగా ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా మేరకు తగ్గుతాయని పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్, బీహార్, దక్షిణ కర్నాటక ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తెలిపింది. దీంతో ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న దేశ ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments