భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుంది : శివసేన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (10:06 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగుదేశం పార్టీలపై కూడా విమర్శలు గుప్పించింది. 
 
మరో 25 యేళ్ల పాటు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న భ్రమలను తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పటాపంచలు చేసిందని ఎన్డీయే కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన వ్యాఖ్యానించింది. ఎన్డీయే సర్కారుపై అపనమ్మకం ఏర్పడిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో వారి నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటాయని పేర్కొంది. 
 
ముఖ్యంగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ అంటూ జరిగితే భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుందని తన పత్రిక 'సామ్నా' సోమవారంనాటి సంపాదకీయంలో జోస్యం చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే అవిశ్వాసం ప్రతిపాదించిందని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments