Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. అంబులెన్స్ నిరాకరణ.. మహిళ మృతి

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (11:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. రోడ్డు బాగాలేదన్న కారణంతో అంబులెన్స్‌ను నిరాకరించింది. దీంతో ఆ మహిళను మంచంపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాల్దా గ్రామానికి 25 యేళ్ల మాము అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యంబారిన పడటంతో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించి ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులను సంప్రదించారు. 
 
అయితే, అ గ్రామానికి రోడ్డు బాగాలేదంటూ అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకుంటూ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మొడికుపర రూరల్ ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments