Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. అంబులెన్స్ నిరాకరణ.. మహిళ మృతి

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (11:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. రోడ్డు బాగాలేదన్న కారణంతో అంబులెన్స్‌ను నిరాకరించింది. దీంతో ఆ మహిళను మంచంపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాల్దా గ్రామానికి 25 యేళ్ల మాము అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యంబారిన పడటంతో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించి ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులను సంప్రదించారు. 
 
అయితే, అ గ్రామానికి రోడ్డు బాగాలేదంటూ అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకుంటూ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మొడికుపర రూరల్ ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments