Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ లాయర్ చేతికే హత్రాస్ కేసు.. శిక్ష ఖాయమన్న సీమా..

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (14:55 IST)
2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వాదించేందుకు లాయర్ సీమా కుష్వాహా ముందుకు వచ్చారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చివరకు దోషులకు శిక్షపడేలా చేశారు. దీంతో ఆమె పేరు యావత్ దేశానికి తెలిసింది. ప్రస్తుతం హత్రాస్ ఘటనతో మరోసారి సీమా తెరపైకి వచ్చారు. ఈ కేసులోనూ న్యాయం జరిగేలా చేయాలని పలువురు కోరుతున్నారు.
 
ఎందుకంటే.. నిర్భయ అత్యాచార కేసులో విజయం సాధించి దోషులకు ఉరిశిక్ష పడేలా పోరాటం చేసిన లాయర్ చేతికే హత్రాస్ కేసు కూడా వెళ్లింది.

లాయర్ సీమా కుష్వాహా ఈ కేసును తీసుకుంటానని పేర్కొన్నారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని వెల్లడించారు. దీని కోసం ఆమె బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు కూడా వెళ్లారు. 
 
అయితే పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయారు. అధికారులు తనకు అంతరాయం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా తాను ఈ కేసును వాదిస్తానని స్పష్టం చేశారు. బాధితురాలి అన్నతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments