నిర్భయ కేసు : ముద్దాయిలు గురువారం రాత్రి ఏం చేశారంటే?

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (09:44 IST)
నిర్భయ కేసులోని దోషులను శుక్రవారం ఉదయం సూర్యోదయానికి ముందే ఉరితీశారు. ఉరితీసిన తర్వాత ఆ నలుగురి శవాలను ఉరికంబానికి అర్థగంటపాటు వేలాడదీశారు. ఆ త‌ర్వాత శ‌వాల‌ను కింద‌కు దింపారు. ఈ నాలుగు మృతదేహాలకు ఢిల్లీలోని డీడీయూ ఆస్పత్రిలో శవపరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కాగా, ఒక కేసులోని నలుగురు ముద్దాయిలను ఒకేసారి ఉరితీయడం భార‌తీయ న్యాయ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, శుక్రవారం సూర్యోదయానికి ముందే ఉరితీయడం ఖాయమని తేలిపోయిన తర్వాత నలుగురు దోషుల గదుల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ముద్దాయిలైన అక్ష‌య్ కుమార్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌, ముకేశ్ సింగ్‌లు గురువారం రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోలేదు. రాత్రంతా జాగారం చేస్తూనే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. అలాగే, ఉరితీతకు ముందు జైలు అధికారులు అల్పాహారం అందించగా, వారిలో ఓ ముద్దాయి తీసుకోలేదు. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీల్లో ఒక్క‌రు కూడా నిద్ర‌పోలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. దోషులు మెడిక‌ల్‌గా ఫిట్ అని తేల్చిన త‌ర్వాత‌నే ఉరి తీశారు. న‌లుగురి శ‌వాల‌ను ప‌రిశీలించి, వారంతా మృతిచెందిన‌ట్లు తీహార్ జైలు డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ సందీప్ గోయ‌ల్ ప్ర‌క‌టించారు.  పోస్టుమార్టం కోసం మృతదేహాలను డీడీయూ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments