Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా.. తండ్రి నుంచి?

Webdunia
గురువారం, 28 మే 2020 (19:13 IST)
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మన్నడిపేటలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కరోనా వైద్యం తీసుకుంటున్న తన తండ్రి నుంచి బాలుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యశాఖాధికారి తెలిపారు. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మందికి పైగా ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు గుర్తించింది. 
 
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్‌కి పంపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments