Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:23 IST)
కరోనాతో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడటం, కొత్త కేసులు తగ్గుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూకి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల గడువు అక్టోబర్‌ 25తో ముగిసింది. దీంతో గత 10 రోజులుగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఉందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో అయోమయానికి తోడు అనేక ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు వాటికి తెరదించాయి. అలాగే, రాష్ట్రంలో గుర్రపు పందేలు పునఃప్రారంభించుకొనేందుకు కూడా పలు నిబంధనలతో కూడిన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. గుర్రపు పందేలు నిర్వహించే ప్రదేశాల్లో సామర్థ్యానికి మించి జనం హాజరు కారాదని, అలాగే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే అనుమతించాలని సూచించింది.

మరోవైపు, గురువారం కర్ణాటకలో 261 కొత్త కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,89,275కి చేరగా.. 38,095మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 8267 క్రియాశీల కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments