Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిల్లాంగ్‌లో కొత్తజంట హనీమూన్, భర్త హత్య-భార్య మిస్సింగ్, పక్కనే కొబ్బరి బొండాం కొట్టే కత్తి

ఐవీఆర్
బుధవారం, 4 జూన్ 2025 (13:50 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌కు చెందిన కొత్తగా పెళ్లైన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ తమ హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న 3 రోజుల తర్వాత ఆ జంట అదృశ్యమయ్యారు. 11 రోజుల పాటుగా తీవ్రంగా గాలించిన తర్వాత, రాజా రఘువంశీ మృతదేహం షిల్లాంగ్ లోయలో లభ్యమైంది. అతడి మృతదేహంకు కాస్తంత దూరంగా కొబ్బరిబొండాలు కొట్టే కత్తి లభించింది. మృతుడి చేతికి వున్న బంగారు వుంగరం, రిస్ట్ వాచ్ మిస్ అయ్యాయి. అతడి మృతదేహం పక్కనే అతడి భార్య వైట్ షర్ట్ లభించింది.
 
మృతుడి భార్య సోనమ్ జాడ ఇప్పటివరకూ తెలియరాలేదు. హనీమూన్ సమయంలో, సోనమ్ తన అత్తగారితో ఫోన్‌లో మాట్లాడింది. ఈ సంభాషణ తర్వాత, ఆ జంట అదృశ్యమయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో నివసించే రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్ రఘువంశీతో కలిసి హనీమూన్ జరుపుకోవడానికి షిల్లాంగ్‌కు వెళ్లారు. ఇద్దరూ షిల్లాంగ్‌లోని ఓయిరా హిల్స్ ప్రాంతం నుండి అదృశ్యమయ్యారు. షిల్లాంగ్ పోలీసులు గత 12 రోజులుగా మృతుడి భార్య సోనమ్ ఆచూకి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో పోలీసులు కనుగొన్నారు. భార్య సోనమ్ కోసం షిల్లాంగ్ పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. కనిపించకుండా పోయే ముందు సోనమ్ రఘువంశీ తన అత్తగారు ఉమా రఘువంశీతో ఫోన్‌లో మాట్లాడింది.
 
ఈ చివరి సంభాషణలో అత్తగారు తన కోడలితో ఎలా వున్నావంటూ ప్రశ్నించింది. నువ్వూ, నా కొడుకు ఇద్దరూ ఏమీ తినకుండా ఎందుకు వున్నారు, ఏదైనా దొరికితే తినండి అంటూ చెప్పింది. దానికి కోడలు సోనమ్ మాట్లాడుతూ... ఇక్కడ తినడానికి, త్రాగడానికి మంచిగా ఏమీ దొరకదు. నేను ఒక చోట కాఫీ తాగాను, అది కూడా బాగోలేదు, దీని గురించి నీ కొడుకు అతడితో కాసేపు వాదించాడు. మేము తాగిన కాఫీ ఏమీ బాగోలేదు అని చెప్పింది. దానికి ఆమె అత్త... ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడున్నారని అడిగింది.
 
ఆయన నన్ను అడవికి నడకకు తీసుకొచ్చారు. ఇది చాలా నిటారుగా వున్న కొండ ప్రాంతం... పైకి ఎక్కడం కష్టంగా వుంది అని చెప్పింది. దాంతో సోనమ్ అత్త మాట్లాడుతూ.. అలాంటి ప్రదేశంలో నువ్వు అక్కడ ఏమి చూడటానికి వెళ్ళావు? కింద నుండి చూసి ఉండవచ్చు" అని అన్నారు. దీనికి సోనమ్, "మేము జలపాతం చూడటానికి వెళ్ళాము" అని చెప్పింది. సోనమ్ తన అత్త ఉమాతో మాట్లాడినప్పుడు ఇదే చివరి కాల్. ఈ సంభాషణ తర్వాత ఆ జంట అదృశ్యమయ్యారు. ఐతే భర్తను హత్య చేసారు. అతడి పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి వుంది. కాగా ఈ హత్య వెనుక వున్న అసలు కారణం ఏంటన్న విషయాన్ని ఛేదించే పనిలో పోలీసులు వున్నారు.
 
మరోవైపు షిల్లాంగ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం సెర్చ్ ఆపరేషన్ కు అడ్డుగా వుంటోంది. అయినప్పటికీ పోలీసులు, NDRF సిబ్బంది సోనమ్ ఆచూకి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments