Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజాత శిశువుకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కరోనా

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:53 IST)
కరోనా వైరస్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. పేద, గొప్ప అనే వ్యత్యాసం అస్సలు లేదు. తనకు దొరికిన వారిని దొరికినట్లు కాటేస్తున్న కోవిడ్-19కు నవజాత శిశువును కూడా సోకింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో నవజాత శిశువుకు కరోనా సోకినట్లు డాకర్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లా బాస్నిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఓ మహిళ ప్రసవించింది.
 
ఐతే అప్పటికే ఆమెకు కరోనా ఉండడంతో వైద్యులు.. పుట్టిన శిశువుకు కూడా వైద్య పరీక్షలు చేశారు. దానికి సంబంధించి ఆదివారం నివేదిక రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా ఆ శిశువుతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే నాగౌర్ జిల్లాలో ఇప్పటివరకు 59 మంది కరోనా బారినపడ్డారు. 
 
ఇంకా రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 97 మంది కోలుకోగా.. 24 మంది మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 1,373 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments