Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిళ్లకు 50మంది చాలు.. 200మంది అవసరం లేదు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (19:38 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో వివాహ వేడుకలకు 50 మంది మాత్రమే హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో 200గా ఉన్న సంఖ్యను 50కి కుదించింది.
 
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయనున్నామని, పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కుదించాలని భావిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు పంపగా.. బుధవారం ఆయన ఆమోద ముద్ర వేశారు.
 
అలాగే, లాక్‌డౌన్ విధిస్తారంటూ చక్కర్లు కొడుతున్న ఊహాగానాలను ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్‌ తోసిపుచ్చారు. దుకాణదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ వ్యాపారాలు తెరిచే ఉంటాయని భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని నిబంధనలను మాత్రం పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అది లాక్‌డౌన్ ఏ మాత్రం కాదంటూ సిసోడియా హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments