కరోనా నిర్ధారణకు కొత్త విధానం

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (18:19 IST)
కరోనా నిర్ధారణ కోసం హైదరాబాద్ శాస్త్రవేత్తలు కొత్త పరీక్షా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.300 ఖర్చుతో అరగంటలోనే ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిమ్స్‌, ఈఎస్‌ఐ శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా కొత్త వైద్య పరీక్షలకు రూపకల్పన చేశాయి. అయితే ఐసిఎంఆర్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ రోజు హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కొత్త వైద్య పరీక్ష విధానంలో కరోనా పరీక్ష చేయించుకున్నారని తెలిపారు. ఈ పరీక్షలో ఆయనకు నెగటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
 
లాక్‌డౌన్‌ విజయవంతమైనా...?
లాక్‌డౌన్‌ విజయవంతమైనా కరోనా వైరస్‌ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో మాత్రం విఫలమైందని ఎయిమ్స్‌ డైరెక్ట్రర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. అలాగే కరోనా వైరస్‌ కేసుల సంఖ్య కూడా ఇంకా వేగవంతం కాలేదని అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో భిన్న సమయాల్లో ఈ మహమ్మారి వేగవంతం కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కేసుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు.

మన జనాభా అధికంగా ఉండటంతో యూరప్‌ దేశాలతో పోల్చలేమని, యూరప్‌లో రెండు మూడు దేశాల జనాభాను కలిపినా మన దేశ జనాభాకు సమానం కాదని అన్నారు. ఆయా దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments