Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా తరువాత రోజాని కలుస్తా.. బాలకృష్ణ ప్రకటన

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (18:13 IST)
బాలకృష్ణ, రోజా... ఈ కాంబినేషన్ సినిమాల్లో హిట్టు. కానీ రాజకీయాల్లో వీరిద్దరివీ భిన్న మార్గాలు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా వుంటే రోజా నగరి ఎమ్మెల్యే తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) చైర్మన్ గానూ వున్నారు.

కానీ ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో గౌరవించుకుంటారు. అలాంటిది త్వరలో వీరిద్దరూ భేటీ కాబోతున్నారట. ఎమ్మెల్యే ఆర్కే రోజాతో త్వరలో సమావేశమవుతానని నందమూరి బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా అక్కడ మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

'రోజాతో ఇంతకు ముందే మాట్లాడాను. తప్పకుండా అభివృద్ధి చేద్దాం బాబు అని ఆమె చెప్పారు. ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు తన కార్యాలయానికి రావాలని, అధికారులందరినీ అక్కడికే పిలిపిస్తానని రోజా చెప్పారు. కరోనా తర్వాత ఒకసారి వెళ్లి కలుస్తా’ అని బాలకృష్ణ ప్రకటించారు.

వీరిద్దరి భేటీ ఎలా వుండబోతుందోనని టీడీపీ, వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments