Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి: కేంద్ర న్యాయశాఖకు సీజేఐ లేఖ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:36 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలతో నిర్వహించిన రెండు రోజుల సదస్సు, నిర్ణయాలకు సంబంధించిన వివరాలతో ఆయన లేఖ రాశారు.

కరోనా కారణంగా డిజిటల్‌ పద్ధతితో కొనసాగుతున్న కోర్టుల పనితీరు మెరుగుకు నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కోరారు. దేశంలో న్యాయస్థానాల సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు.

న్యాయవ్యవస్థలో ఉన్నవారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలన్నారు. కొవిడ్‌ వల్ల నష్టపోయిన న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు కొలీజియం సిఫారసులపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments