Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూ రాసిన లేఖలు తిరిగి అప్పగించాలి : రాహుల్‌కు పీఎంఎంఎల్ లేఖ

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (12:22 IST)
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ప్రధానమంత్రి సంగ్రహాలయ - పీఎంఎంఎల్) లేఖ రాసింది. ఈ లేఖలను గత 2008లో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది.  
 
చరిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన వాటిని సోనియాగాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబరులోనే పీఎంఎంఎల్ కోరింది. మరోసారి రాహుల్‌కు డిసెంబరు 10వ తేదీన అదేతరహా అభ్యర్ధన చేసింది. కనీసం ఫొటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అయినా అందించాలని అడిగింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటెన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. జాతి నిర్మాణంలో కీలకభూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments