Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీట్' నిర్వహించాల్సిందే.. కేంద్రం పిటీషన్ తిరస్కృతి : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:24 IST)
దేశంలోని వైద్య కాలేజీల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహించాల్సిందేనంటూ గురువారం ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు ఉండబోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆదేశాలు జారీ చేశాక పాటించి తీరాల్సిందేనంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 
 
నీట్ పరీక్షతో పాటు.. ప్రీమెడికల్ ఎంట్రెన్స్ (ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం) పరీక్షను నిర్వహించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని, నీట్ పరీక్షను నిర్వహించాలని కోరుతూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ పిటీషన్‌ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చిన కోర్టు... ప్ర‌క‌టించిన షెడ్యూల్‌ మేర‌కే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్ర‌ెన్స్ టెస్ట్ (నీట్‌)ను నిర్వ‌హించాల‌ని తేల్చి చెప్పింది. 
 
అయితే, గురువారం జారీచేసిన ఉత్త‌ర్వుల్లో సవరణలు కోరుకుంటే ద‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయాల‌ని సూచించింది. స‌వ‌ర‌ణ‌లు కోరితే వాటిపై విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే నీట్‌ను మే1, జులై 24న నీట్ ప‌రీక్ష‌ను నిర్వహించాల‌ని ఆదేశించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments