Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ, నీట్ పరీక్షలు.. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం.. శివరాజ్ సింగ్ చౌహాన్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (11:46 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో నీట్ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు అనేక నిరసనలు, భయాందోళనల నడుమ రేపటి నుంచి (సెప్టెంబర్ 1) మొదలవనున్నాయి. అలాగే సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వచ్చేనెల 13వ తేదీన జరుగనున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలైన జేఈఈ, నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. బ్లాక్‌ లేదా జిల్లా కేంద్రాల నుంచి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను ఉచితంగా తీసుకువెళ్తామని తెలిపారు. అయితే విద్యార్థులు 181 నెంబర్‌లో లేదా వెబ్‌పోర్టల్‌లో సోమవారం సాయంత్రంలోగా రిజిస్టర్ చేసుకోవాలని సీఎం సూచించారు.
 
ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు ఇలాంటి ప్రకటనలే చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, వారికి అవసరమైన సహాయం అందించాలని వారి పార్టీ కార్యకర్తలకు సూచించారు. 
 
అదేవిధంగా విద్యార్థుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, వారికి కరోనా నిబంధనల ప్రకారం అన్నిరకాల చర్యలు తీసుకునే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments